Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Numbers Chapters

Numbers 26 Verses

1 ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను కుమారుడు యాజకుడైన ఎలీయాజరుతో యెహోవా మాట్లాడాడు:
2 “ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించండి. ప్రతి కుటుంబాన్నీ చూచి, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న పురుషులందరిని లెక్కించండి. వీరు ఇశ్రాయేలు సైన్యంలో పని చేయటానికి సమర్థులు” అని ఆయన చెప్పాడు.
3 ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇది యెరికోకు ఎదురుగా యోర్దాను నది దగ్గర ఉంది. కనుక మోషే, యాజకుడైన ఎలీయాజరు ప్రజలతో మాట్లాడారు. వారు
4 “20 గాని, అంతకంటె ఎక్కువ వయసు గాని ఉన్న మగవాళ్ల సంఖ్య లెక్కించాలి. ఇది మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అన్నారు.” ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల జాబితా ఇది:
5 రూబేను సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద కుమారుడు రూబేను. వంశాలు: హనోకు - హనోకీల వంశం పల్లు పల్లువారి వంశం
6 హెస్రోను హెస్రోనీల వంశం కర్మి కర్మీల వంశం
7 రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43, 730 మంది పురుషులు.
8 పల్లు కుమారుడు ఏలీయాబు.
9 నెమూయేలు, దాతాను, అబీరాము ముగ్గురూ ఏలీయాబు కుమారులు. మోషే, అహరోనులకు ఎదురు తిరిగిన నాయకులు దాతాను, అబీరాము అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు కోరహు ఎదురు తిరిగినప్పుడు వారు కోరహును వెంబడించారు.
10 అప్పుడే భూమి తెరచుకొని, కోరహును, అతని అనుచరులు అందరినీ మింగివేసింది. చనిపోయిన వారి సంఖ్య మొత్తం 250 మంది పురుషులు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక, గుర్తు.
11 అయితే కోరహు కుటుంబంలోని ఇతరులు మరణించలేదు.
12 షిమ్యోను సంతతిలోని వంశాలు ఇవి: నెమూయేలు - నెమూయేలీ వంశం యామీను - యామీనీల వంశం యాకీను - యాకీనీల వంశం
13 జెరహు - జెరహీల వంశం షావూలు - వూలీ వంశం
14 షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు మొత్తం 22,200 మంది.
15 గాదు సంతతిలోని వంశాలు ఇవి: సెపోను - సెపోనీల వంశం హగ్గి - హగ్గీల వంశం షూనీ - షూనీల వంశం
16 ఓజని - ఓజనీల వంశం ఏరీ - ఏరీల వంశం
17 అరోది - అరోదీల వంశం అరేలి - అరేలీల వంశం
18 అవి గాదు సంతతిలోని వంశాలు. వారు మొత్తం 40,500 మంది పురుషులు.
19 [This verse may not be a part of this translation]
20 [This verse may not be a part of this translation]
21 పెరెసు వంశాలు ఇవి: హెస్రోను - హెస్రోనీల వంశం హములు - హములీల వంశం
22 యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500.
23 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి: తోల - తోలాలీ వారి వంశం పువ్వా - పువ్వీల వంశం
24 యాషుబు - యాషుబీల వంశం షిమ్రోను - షిమ్రోనీల వంశం
25 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 64,300.
26 జెబూలూను సంతతిలోని వంశాలు: సెరెదు - సెరెదీల వంశం ఏలోను - ఏలోనీల వంశం యహలేలు - యహలేల వంశం
27 జెబూలూను సంతతిలోని వంశాలు అవి. పురుషులు సంఖ్య మొత్తం 60,500.
28 యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు.
29 మనష్షే సంతతి ఏవనగా: మాకీరు - మాకీరువారి వంశం (మాకీరు గిలాదుకు తండ్రి,) గిలాదు - గిలాదీల వంశం
30 గిలాదు వంశాలు: ఈజురు - ఈజరీల వంశం హెలెకు - హెలెకీవారి వంశం
31 అశ్రీయేలు - అశ్రీయేలీల వంశం షెకెము - షెకెమీల వంశం
32 షెమిద - షెమిదీల వంశం హెపెరు - హెపెరీల వంశం
33 హెపెరు కుమారుడు సెలోపెహదు. కానీ అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహల, నోయా, హోగ్ల, మిల్కా తిర్సా.
34 అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700
35 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు ఏవనగా: షుతల - షుతలీల వంశం బేకరు - బేకరీల వంశం తహను - తహనీల వంశం
36 షుతలహు వంశం వాడు ఏరాను. అతని వంశ ఏరానీల వంశం
37 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 32,500 యోసేపు సంతతికి చెందిన మొత్తం మనుష్యులు వారే.
38 బెన్యామీను సంతతిలోని వంశాలు: బెలా - బెలాలీ వంశం అష్బెలు - అష్బెలీ వంశం అహీరం - అహీరమీయీల వంశం
39 షుపం - షుపామీల వంశం హుపం - హుపామీల వంశం
40 బెలా వంశాలు ఏవనగా: ఆర్దు - ఆర్దీల వంశం నయమాను - నయమానీల వంశం
41 బెన్యామీను సంతతిలోని వంశాలన్నీ అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,600
42 దాను సంతతిలోని వంశాలు: షూషాము- షూషామల వంశం. అది దాను సంతతిలోని కుటుంబం.
43 షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400
44 ఆషేరు సంతతిలోని వంశాలు: ఇమ్నా - ఇమ్నా వారి వంశం ఇష్వి - ఇష్వీల వంశం బెరీయ - బెరీయాల వంశం
45 బెరీయా వంశాలు: హెబెరు - హెబెరీల వంశం మల్కీయేలు - మల్కీయేలీల వంశం.
46 (ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.)
47 ఆషేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 53,400
48 నఫ్తాలీ సంతతిలోని వంశాలు: యహసియేలు - యహసియేలీల వంశం గూని - గూనీల వంశం
49 యెసెరు - యెసెరీల వంశం షిల్లేము - షిల్లేమీల వంశం
50 నఫ్తాలీ సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,400
51 కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 6,01,730
52 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
53 “ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది.
54 పెద్ద వంశానికి ఎక్కువ భూమి లభిస్తుంది. చిన్న వంశానికి తక్కువ భూమి లభిస్తుంది. అయితే నేను వాగ్దానం చేసిన దేశం ప్రతి వంశానికీ లభిస్తుంది. మరియు వారికి లభించే భూమి, లెక్కించబడిన వారందరికీ సరిపోయేటంత ఉంటుంది.
55 ప్రతి వంశానికీ ఆ భూమి ఇవ్వబడుతుంది. ఏ వంశం వారి భూమికి ఆ పేరే పెట్టబడుతుంది.
56 ప్రజలకు ఇస్తానని నేనే వాగ్దానం చేసినంతగా ఉంటుంది ఆ భూమి. పెద్ద వంశాలకీ, చిన్నవాటికీ అందివ్వబడుతుంది.”
57 లేవీ సంతతి కూడ లెక్కించబడింది. లేవీ సంతతిలోని వంశాలు ఇవి: గెర్షోను - గెర్షోనీల వంశం కహాతు - కహాతీల వంశం మెరారి - మెరారిల వంశం
58 ఇవి కూడ లేవీ సంతతిలోని వంశాలే: లిబ్నీల వంశం హెబ్రోనీల వంశం మహ్లీవంశం మూషీల వంశం కోరహీల వంశం అమ్రాము కహాతు వంశం వాడు.
59 అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఆమె కూడ లేవీ సంతతిలోనిదే. ఆమె ఈజిప్టులో పుట్టింది. అమ్రాము, యొకెబెదులకు అహరోను, మోషే ఇద్దరు కుమారులు. వారికి మిర్యాము అని ఒక కుమార్తె కూడ ఉంది.
60 నాదాబు, అబీహు, ఎలీయాజరు, ఈతామారులకు తండ్రి అహరోను.
61 కానీ నాదాబు, అబీహు చనిపోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణచేసినందువల్ల వారు చనిపోయారు.
62 లేవీ సంతతిలో పురుషుల సంఖ్య మొత్తం 23,000, అయితే ఇతర ఇశ్రాయేలు మనుష్యులతో వీరు లెక్కించబడలేదు. మిగిలినవారికి యెహూవా వాగ్దానం చేసిన భూమి మాత్రం లేదు.
63 మోషే, యాజకుడైన ఎలీయాజరు ఈ ప్రజలందరినీ లెక్క చేసారు. మోయాబు మైదానాల్లో వారు ఇశ్రాయేలు ప్రజలను లెక్క తీసారు. ఇది యెరికో ఎదుట యోర్దాను నది అవతల జరిగింది.
64 చాలకాలం కిందట సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే, యాజకుడైన అహరోనూ లెక్కపెట్టారు. అయితే వాళ్లంతా చనిపోయారు. మోషే మోయాబు మైదానాల్లో లెక్కపెట్టిన వారు వేరు, అంతకుముందు లెక్కపెట్టిన వారు వేరు.
65 వారు అందరూ ఎడారిలోనే చస్తారు అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చెప్పినందువల్ల ఇలా జరిగింది. సజీవంగా ఉన్నవాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే.
×

Alert

×